చిట్కుల్ లోని దుర్గామాత ఆలయంలో,,ఎంపీ అభ్యర్థి నీలం మధు ప్రత్యేక పూజలు,,

భారత్ న్యూస్ హైదరాబాద్…

దుర్గమ్మకు అభిషేకం..

చిట్కుల్ లోని దుర్గామాత ఆలయంలో
ఎంపీ అభ్యర్థి నీలం మధు ప్రత్యేక పూజలు

మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నీలం ముదిరాజ్ మంగళవారం దుర్గమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పటాన్చెరు నియోజకవర్గం చిట్కుల్ గ్రామంలోని దుర్గమ్మ ఆలయాన్ని దర్శించుకుని, అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా వేద పండితులు ఎంపీ అభ్యర్థి నీలం మధు తో అమ్మవారికి విశేష అభిషేకాన్ని నిర్వహించారు. అలాగే స్థానిక మల్లన్న స్వామి దేవాలయంలో కూడా ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, స్థానికులు పాల్గొన్నారు.