Minister Uttam Kumar Reddy’s review with senior officials in Civil Supply Office..

భారత్ న్యూస్ హైదరాబాద్,

సివిల్ సప్లై కార్యాలయంలో ఉన్నతాధికారులతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష..

పేద ప్రజలకు ప్రభుత్వం ఇస్తున్న బియ్యం సరఫరా విషయంలో మనం మరింత పారదర్శకంగా ఉండాలి.

1.8 మెట్రిక్ టన్నుల బియ్యం ప్రజలకు ఉచితంగా ఇస్తున్నాం..

కానీ ప్రజలు వాటిని ఉపయోగించుకుంటున్నారా అన్నది మనం గమనించాలి.

కిలో 39 రూపాయలు పెట్టి మనం సేకరిస్తున్న బియ్యం ప్రజలకు ఉచితంగా ఇస్తున్నాం..

కానీ అవి పేదలు తినకపోతే ఇంత పెద్ద గొప్ప ఉచిత బియ్యం పథకం నిరుపయోగం అవుతుంది..

మొక్కుబడిగా కాకుండా లోపాలు ఎక్కడ ఉన్నాయో వెతకాలి..

బియ్యం పేదలకు ఎలా ఉపయోగకరమైన పథకం గా ఉంటుందో మనం అధ్యయనం చేయాలి..

రాష్ట్రములో బియ్యం లబ్దిదారుల నుంచి రాండం చెక్ చెయ్యాలి.. ప్రజల నుంచి సమాచారం సేకరించాలి

ప్రజలకు మరింత ఉపయోగకరంగా ఉండాలి..

పేదలకు ఇస్తున్న బియ్యం వారు తినే విదంగా ఉండాలి తప్ప వేరే విదంగా దుర్వినియోగం కావొద్దు.

రైస్ మిల్లర్ల నుంచి బియ్యం సేకరణలో జాప్యం ఎందుకు జరుగుతుంది అని అడిగి తెలుసుకున్న మంత్రి..

రాష్ట్రంలో రైతుల నుంచి సివిల్ సప్లై శాఖ ద్వారా కొనుగోలు చేస్తున్న ధాన్యం వివరాలు అడిగిన మంత్రి..

సివిల్ సప్లై శాఖ రాష్ట్రంలో ముఖ్యమైన శాఖ.

రైతుల నుంచి ప్రోక్యూర్మెంట్ చేసే శాఖ.

గ్యాస్ సిలిండర్ 500, ప్యాడి ప్రోక్యూర్మెంట్ లో 500 పెంచే ది వంద రోజుల్లో అమలు చేస్తాం.

క్వాలిటీ రేషన్ సప్లై.. 5 కిలోల బియ్యం కేంద్రం ఇస్తుంది. రాష్ట్రం ఇచ్చే కిలో బియ్యం క్వాలిటీ పెరగాలి.

ఇప్పటి వరకు ఒక కిలోనే ప్రతీ మనిషికి బిఆర్ఎస్ ఇచ్చింది. ఉచితంగా ఇచ్చారు.

లబ్ధిదారుల నుంచి పీడీఎస్ రైస్ డైవర్ట్ అయ్యింది

లబ్ధిదారులకు తినగలిగే రైస్ ఇవ్వాలి

కమిషనర్ మళ్ళీ సమీక్ష చేయాలి.

2కోట్ల 80 లక్షల మంది లబ్ధిదారులున్నారు.

ప్రోక్యూర్మెంట్ కు సివిల్ సప్లై అన్ని చర్యలు తీసుకోవాలి.

రైతులకు డబ్బులు వెంటనే అందే విధంగా చర్యలు తీసుకోవాలి.

గత ప్రభుత్వం ఈ శాఖకు ఆర్థిక శాఖకు సహాయం చేయక పోవడంతో 56 వేల కోట్లు అప్పు చేసింది.

సివిల్ సప్లై కార్పొరేషన్ 90 లక్షల మెట్రిక్ టన్నులు
18వేల కోట్ల విలువైన ప్యాడి రైస్ మిల్లర్ల వద్ద ఉంది. దీనిపై ఏం చేయాలనేది క్యాబినెట్ లో చర్చిస్తాం.

1.17లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సివిల్ సప్లై వద్ద ఉంది.

11వేల కోట్ల నష్టాల్లో సివిల్ సప్లై కార్పొరేషన్ ఉంది.

తొమ్మిదిన్నర ఏళ్ల బిఆర్ఎస్ పాలనలో లోపాలు ఉన్నాయి.

ఉన్న రేషన్ కార్డులో బియ్యం తీసుకున్న వారు 89 శాతం దాటిపోలేదు.

కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ ఉంది. సీఎం దృష్టికి ఆ విషయాన్ని తీసుకువెళ్తా.

రాష్ట్రంలోని అన్ని శాఖల్లో ఆర్థిక పరిస్థితి బాగోలేదు.