సికింద్రాబాద్ లోని నల్లగుట్ట ప్రాంతంలో స్థానిక మైనారిటీ నాయకుడు రహీం తదితరులు సోమవారం సాయంత్రం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో సికింద్రాబాద్ పార్లమెంట్

సికింద్రాబాద్ : సికింద్రాబాద్ లోని నల్లగుట్ట ప్రాంతంలో స్థానిక మైనారిటీ నాయకుడు రహీం తదితరులు సోమవారం సాయంత్రం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ బీ.ఆర్.ఎస్.పార్టీ అభ్యర్ధి తీగుల్ల పద్మారావు గౌడ్ పాల్గొన్నారు. మాజీ మంత్రి, సనత్ నగర్ శాసనసభ్యుడు తలసాని శ్రీనివాస్ యాదవ్, ముషీరాబాద్ శాసనసభ్యుడు ముఠా గోపాల్, మాజీ మంత్రి మహమూద్ అలీ తో పాటు నేతలు, కార్పొరేటర్లు, మైనారిటీ ప్రముఖులు ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పద్మారావు గౌడ్ మాట్లాడుతూ ఇఫ్తార్ విందు కార్యక్రమాలు సమగ్రతకు, ప్రాచిన సంస్కృతికి ప్రతీకలుగా నిలుస్తాయని అన్నారు. ప్రజలు ఉగాది, రంజాన్ పండుగలను ఆనందంగా జరుపుకోవాలని సూచించారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలు చిరకాలంగా విశిష్ట స…