Bharathnews.hyd,,,,
మాజీ మంత్రి జగదీష్ రెడ్డి దిగ్భ్రాంతి
#శ్రీరామ శ్రీనివాస్ లోటు పూడ్చ లేనిది
ప్రముఖ సంఘ సేవకుడు శ్రీరాంశ్రీనివాస్ ఆకస్మిక మరణం పట్ల రాష్ట్ర విద్యుత్ శాఖా మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.వ్యక్తిగతంగా తనకు ఆయన ఆత్మీయ మిత్రులని సూర్యాపేట లో నిర్వహించిన ప్రతి కార్యక్రమంలో ఆయన భాగస్వామ్యం ఉండేదని ఆయన గుర్తు చేసుకున్నారు.ముఖ్యంగా సూర్యాపేట జిల్లా పద్మశాలి సంఘము ఆధ్వర్యంలో సూర్యాపేటలో జరిగిన ఆత్మీయ సమ్మేళనం తాలూకు జ్ఞాపకాలను ఆయన గుర్తు చెసుకున్నారు.సామాజిక సేవా కార్యక్రమంలో ఆయన పోషించిన పాత్ర వేల కట్టలేనిదని ఆయన కొనియాడారు. అంతకు మించి కరోన వంటి విపత్కర సమయంలో ఆయన తీసుకున్న సేవా కార్యక్రమాలు ఎప్పటికీ ప్రజల మదిలో నిలిచి పోతాయని ఆయన చెప్పారు.అటువంటి వ్యక్తి లేని లోటు పూడ్చ లేనిదన్నారు.ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు.