నాంపల్లి రైలు అగ్నిప్రమాదంపై రైల్వే GM వివరణ…..

భారత్ న్యూస్ హైదరాబాద్…నాంపల్లి రైలు అగ్నిప్రమాదంపై రైల్వే GM వివరణ…..

శుక్రవారం నాంపల్లి రైల్వే స్టేషన్‌లో షంటింగ్ చేస్తున్న రైలు బోగీలో అగ్నిప్రమాదం సంభవించింది. విద్యుత్ కనెక్షన్ ఇవ్వకముందే పొగలు రావడంతో అప్రమత్తమైన సిబ్బంది వెంటనే ఆ బోగీని వేరు చేశారు. ఈ ఘటనలో ఒక బోగీ పూర్తిగా, మరొకటి స్వల్పంగా దెబ్బతిన్నాయి. అదృష్టవశాత్తు, బోగీలలో ప్రయాణికులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. విద్యుత్ కనెక్షన్ ఇవ్వకముందే మంటలు ఎలా వచ్చాయనే దానిపై ఫోరెన్సిక్ విచారణ జరుగుతుందని SCR జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ తెలిపారు…