ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రపతి పర్యటన.. షెడ్యూల్ ఖరారు….

భారత్ న్యూస్ శ్రీకాకుళం… ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రపతి పర్యటన.. షెడ్యూల్ ఖరారు….

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రెండు రోజుల పాటు ఏపీలో పర్యటించనున్నారు. జూన్ 30న విశాఖపట్నంలోని నోవాటెల్ హోటల్లో జరిగే ‘ట్రైబల్ యూనివర్సిటీ ఆఫ్ ఏపీ (విజయనగరం)’ స్నాతకోత్సవంలో ఆమె పాల్గొంటారు. అనంతరం బెంగళూరుకు వెళ్లి అక్కడ లోక్భవన్లో బస చేస్తారు. జులై 1న అనంతపురంలోని కేంద్రీయ విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఈ కార్యక్రమం అనంతరం బెంగళూరు మీదుగా న్యూఢిల్లీకి బయలుదేరి వెళ్తారు…