భారత్ న్యూస్ సినిమా,,,సంక్రాంతి పండగకి బాక్సాఫీస్ దగ్గర భారీ ఫైటే జరగబోతుంది. ఈసారి ఏకంగా 5 పెద్ద సినిమాలు బరిలో ఉన్నాయి. వీటిలో మహేశ్ బాబు ‘గుంటూరు కారం’ కూడా ఒకటి. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జనవరి 12న రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ భారీగా సాగుతున్నాయి. నిన్న రిలీజైన ‘కుర్చీ మడతపెట్టి’ సాంగ్ అయితే సోషల్ మీడియా, యూట్యూబ్ను షేకాడిస్తుంది. ఎక్స్లో అయితే గుంటూరు కారం హ్యాష్ ట్యాగ్లు తెగ ట్రెండ్ అవుతున్నాయి. ఇక వీటికి తోడు మహేశ్ బాబు ఫ్యాన్స్కి అదిరిపోయే వార్త చెప్పారుGuntur Kaaram: రాజమౌళి కలెక్షన్ల దగ్గరికి వెళ్లిపోతాం.. గుంటూరు కారం నిర్మాత కామెంట్స్
నిర్మాత కామెంట్స్
2024 సంక్రాంతికి మహేశ్ బాబు గుంటూరు కారంతో థియేటర్లలో సందడి చేయబోతున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, లిరికల్ వీడియో సాంగ్స్కి భారీ రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజాగా సినిమా సక్సెస్పై ప్రొడ్యూసర్ నాగ వంశీ కాన్ఫిడెన్స్ మాములుగా లేదు.