దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలో అత్యధిక పారితోషికం అందుకుంటున్న కథానాయికగా నయనతార పేరు వినిపిస్తోంది. అయితే ఆ తర్వాత మళ్లీ ఆ స్థాయిలో పారితోషికం అందుకుంటున్న మరో దక్షిణాది నాయిక ఉందనేది మీకు తెలుసా? ఈ ప్రశ్నకు సమాధానం ఇప్పుడు స్పష్ఠంగా ఉంది. నయనతార ‘జవాన్’ లాంటి పాన్ ఇండియా హిట్ చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ విజయంతో సంబంధం లేకుండానే ఒక్కో సినిమాకి సుమారు 10కోట్ల రేంజులో పారితోషికం అందుకుంటున్న కథానాయికగా వెలిగిపోతోంది. ఇప్పుడు కమల్ హాసన్ కథానాయకుడిగా మణిరత్నం తెరకెక్కించనున్న భారీ చిత్రంలో నటించేందుకు నయనతారకు 12 కోట్లు ఆఫర్ చేసారని సమాచారం.