జమ్మవరం గ్రామ సచివాలయం పై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు.

భారత్ న్యూస్ విజయవాడ…ఏఎస్ పేట మండలం జమ్మవరం గ్రామ సచివాలయం పై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. కాకర్లపాడు గ్రామానికి చెందిన అశోక్ కుమార్ కు సంబంధించిన ఎకరా 78 సెంట్లు భూమికి పట్టాదారు పాసుపుస్తకాలు ఇచ్చేందుకు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసుకున్నాడు. అయితే పట్టాదారు పాసుపుస్తకాలు మంజూరు చేసి ఇచ్చేందుకు వీఆర్వో గంగాధర్ 15000 డిమాండ్ చేశారు. ఈ క్రమంలో లంచం ఇచ్చేంత స్తోమత లేకపోవడంతో అశోక్ కుమార్ ఏసీబీని ఆశ్రయించాడు. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు పక్క ప్రణాళికతో అశోక్ కుమార్ వద్దనుండి డబ్బులు తీసుకుంతుండగా వీఆర్వో గంగాధర్ను రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.