శివునికి అభిషేకం చేయిస్తే చాలు…అన్నీ శుభఫలితాలే……..!!

భారత్ న్యూస్ తిరుపతి…శివునికి అభిషేకం చేయిస్తే చాలు…అన్నీ శుభఫలితాలే……..!!

శివునికి అభిషేకం……

శివుడు అభిషేక ప్రియుడు. శివునికి అభిషేకం చేయించడం వల్ల సదాశివుని అనుగ్రహంతో పాపాలు హరించుకుపోతాయి. మహాశివునికి అభిషేకం చేయించడం ద్వారా వంశాభివృద్ధి చేకూరుతుంది. శివునిని అభిషేకాలతో సంతృప్తి పరచడం వల్ల అనేక దోషాలు నశించి ఆయురారోగ్యాలు చేకూరుతాయి. ఈతిబాధలు, ఆర్థిక ఇబ్బందులు వుండవు. తద్వారా ఆ కుటుంబం తరతరాల పాటు సకల శుభాలను సంతరించుకుంటుంది. ఆవుపాలతో శివునికి అభిషేకం చేస్తే సర్వ సుఖాలు కలుగుతాయి. పసుపు నీటితో అభిషేకం జరిపితే మంగళప్రదమైన శుభకార్యాలు జరుగుతాయి.

మారేడు బిల్వదళ జలముతో చేత అభిషేకం చేసిన భోగభాగ్యాలు లభిస్తాయి. గరిక నీటితో శివాభిషేకం చేయించిన వారికి నష్టపోయిన ధనం తిరిగి పొందగలరు. పెరుగుతో శివునికి అభిషేకం చేయిస్తే.. ఆరోగ్యం చేకూరుతుంది. పంచదారతో చేయిస్తే దుఃఖం తొలగిపోతుంది. రుద్రాక్ష జలాభిషేకం చేసినచో సకల ఐశ్వర్యాలు చేకూరుతాయని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు.

శివాభిషేక ఫలములు……..

పసుపు నీటితో అభిషేకించిన మంగళ ప్రదము అగును – శుభ కార్యములు జరుగ గలవు.

గరిక నీటితో శివాభిషేకము చేసిన నష్టమైన ద్రవ్యము తిరిగి పొందగలడు.

నువ్వుల నూనెతో అభిషేకించిన అపమృత్యువు నశించ గలదు.

ఆవు పాల అభిషేకం సర్వ సౌఖ్యములను ప్రసాదించును.

పెరుగుతో అభిషేకించిన బలము, ఆరోగ్యము, యశస్సు లభించును.

ఆవు నేయితో అభిషేకించిన ఐశ్వర్య ప్రాప్తి కలుగును.

చెరకు రసముతో అభిషేకించిన ధన వృద్ది కలుగును.

మెత్తని చేక్కరతో అభిషేకించిన దుఃఖ నాశనము కలుగును.

మారేడు బిల్వదళ జలము చేత అభిషేకము చేసిన భోగభాగ్యములు లభించును.

తేనెతో అభిషేకించిన తేజోవృద్ది కలుగును.

పుష్పోదకము చేత అభిషేకించిన భూలాభము కలుగును.

కొబ్బరి నీటితో అభిషేకము సకల సంపదలను కలిగించును.

రుద్రాక్ష జలాభిషేకము సకల ఐశ్వర్యములనిచ్చును.

భస్మాభిషేకంచే మహా పాపాలు నశించును.

గందోదకము చేత అభిషేకించిన సత్పుత్ర ప్రాప్తి కలుగును.

బంగారపు నీటితో అభిషేకము వలన ఘోర దారిద్రము నశించును.

నీటితో అభిషేకించిన నష్టమైనవి తిరిగి లభించును.

అన్నముతో అభిషేకించిన అధికార ప్రాప్తి, మోక్షము మరియు దీర్ఘాయువు లభించును. శివపూజలో అన్న లింగార్చనకు ప్రత్యేక ప్రాధాన్యత కలదు – పెరుగు కలిపిన అన్నముతో శివ లింగానికి మొత్తంగా అద్ది (మెత్తుట) పూజ చేయుదురు – ఆ అద్దిన అన్నాన్ని అర్చనానంతరము ప్రసాదముగా పంచి పెట్టెదరు, చూడటానికి ఎంతో చాలా బాగుంటుంది అన్న లింగార్చన).

ద్రాక్షా రసముచే అభిషేక మొనర్చిన ప్రతి దానిలో విజయము లభించగలదు.

ఖర్జూర రసముచే అభిషేకము శత్రుహానిని హరింప జేస్తుంది.

నేరేడు పండ్ల రసముచే అభిషేకించిన వైరాగ్య సిద్ది లభించును.

కస్తూరి కలిపిన నీటిచే అభిషేకించిన చక్రవర్తివ్తము లభించును.

నవరత్నోదకము చే అభిషేకము ధాన్యము, గృహ, గోవృద్దిని కలిగించును.

మామిడి పండ్ల రసము చేత అభిషేకము చేసిన దీర్ఘ వ్యాధులు నశించును.