ఉల్లిపాలెం లో వాలంటీర్లు ముకుమ్మడి రాజీనామా,,,

భారత్ న్యూస్ విజయవాడ:-

ఉల్లిపాలెం లో వాలంటీర్లు ముకుమ్మడి రాజీనామా

👉కోడూరు మండలంలోని ఉల్లిపాలెం సచివాలయ పరిధిలోని 27 మంది వాలంటీర్లు శుక్రవారం ముకుమ్మడిగా రాజీనామా చేశారు. ఉల్లిపాలెం హంసలదీవి పంచాయతీ పరిధిలో 28 మంది వాలంటీర్లు ఉండగా, అందరూ రాజీనామా పత్రాలు సంబంధిత సచివాలయ సిబ్బందికి అందించారు.

👉 ఇప్పటికే హంసలదీవి వాలంటీర్ బుద్ధ ప్రసాద్ వాలంటీర్ కు రాజీనామా చేసి అవనిగడ్డ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేసిన సంగతి తెలిసిందే. దీంతో సచివాలయ పరిధిలోని 28 మంది వాలంటీర్లు రాజీనామాలను అందించారు.