అవనిగడ్డ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సింహాద్రి రమేష్ బాబు, మచిలీపట్నం,,

భారత్ న్యూస్ కోడూరు

సింహాద్రి గెలుపే లక్ష్యంగా పనిచేస్తున్న వైసీపీ శ్రేణులు

అవనిగడ్డ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సింహాద్రి రమేష్ బాబు, మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి సింహాద్రి చంద్రశేఖర్ ల గెలుపే లక్ష్యంగా కోడూరు మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కోడూరులోని మెరక గౌడపాలెం గ్రామంలో శనివారం విస్తృతంగా ప్రచారం చేపట్టారు.
ఇంటింటికి తిరుగుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను గురించి ప్రజలకు వివరించి, మరలా మరోసారి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని సింహాద్రి రమేష్ బాబును ఎమ్మెల్యేగా, సింహాద్రి చంద్రశేఖర్ ను ఎంపీగా గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.
ఈ కార్యక్రమంలో కోడూరు మండలం ప్రజా ప్రతినిధులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.