తిమ్మరాజు పల్లెను నుంచి వలసలు,,పులివర్తి నానితో అభివృద్ధి సాధ్యం,,

భారత్ న్యూస్ గుడివాడ….

తిమ్మరాజు పల్లెను నుంచి వలసలు

పులివర్తి నానితో అభివృద్ధి సాధ్యం

రామచంద్రాపురం మండలం, యన్ ఆర్ కమ్మపల్లి పంచాయతీ, తిమ్మరాజు పల్లి నుంచి తెలుగుదేశం పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. గురువారం తిరుపతి రూరల్ మండలం, రఘునాథ్ రిసార్ట్స్ లోని పార్టీ కార్యాలయంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని సమక్షంలో హరిజనవాడకు చెందిన యన్.రవి, యన్. లోకనాదం, యుగంధర్, ప్రశాంత్ బాబు, వెంకటయ్య, డిల్లి బాబు, సుబ్రమణ్యం, జి శంకర్, రామ్మూర్తి తదితరులు తెలుగుదేశం పార్టీలో చేరారు. గత 5 ఏళ్లుగా గ్రామంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగడం లేదని పార్టీలో చేరిన వారన్నారు. నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే పులివర్తి నానితోనే సాధ్యమని భావించి టీడీపీలో చేరడమైందన్నారు. ఆయన విజయానికి కృషి చేస్తామని చెప్పారు.

.