వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన అశ్వరావుపాలెం తెలుగుదేశం, జనసేన పార్టీ శ్రేణులు,

భారత్ న్యూస్ అవనిగడ్డ

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన అశ్వరావుపాలెం తెలుగుదేశం, జనసేన పార్టీ శ్రేణులు

జగన్ వెంటే మేముంటామంటున్న గ్రామాల ప్రజలు

అవనిగడ్డ నియోజకవర్గంలో రోజు రోజుకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి పెరుగుతున్న ప్రజాబలం

అవనిగడ్డ మండలంలోని అశ్వారావుపాలెం గ్రామానికి చెందిన తెలుగుదేశం, జనసేన పార్టీ శ్రేణులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.

అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు సమక్షంలో అవనిగడ్డలోని నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం 20 కుటుంబాలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్థం తీసుకున్నారు.

ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ముగ్ధులై పార్టీలో చేరినట్లు అశ్వరావుపాలెం గ్రామస్తులు తెలిపారు.

దాసినేని రేణుకయ్య, గాదే సుబ్బారావు, దాసినేని నాంచారయ్య, దాసినేని శ్రీనివాసరావు, మేరుగు జ్ఞానసుందరరావు, కటికల మునేశ్వరరావు, కటికల శ్రీనివాసరావు తదిరులు పార్టీలో చేరిన వారిలో ఉన్నారు.

ఈ కార్యక్రమంలో రైతు విభాగం జోనల్ ఇంచార్జ్ కడవకొల్లు నరసింహారావు, జడ్పిటిసి సభ్యులు చింతలపూడి లక్ష్మీనారాయణ, మండల పార్టీ కన్వీనర్ రేపల్లె శ్రీనివాసరావు, యువ నేత కడవకొల్లు చైతన్య, గ్రామ పార్టీ కన్వీనర్ దాసినేని భాగ్యరాజు, సర్పంచ్ లు దాసరి విజయ్, వాకా రమేష్ తదితరులు పాల్గొన్నారు.