ఖాతాల్లోకి రూ.12,000.. అర్హతలు ఇవే

…భారత్ న్యూస్ హైదరాబాద్….ఖాతాల్లోకి రూ.12,000.. అర్హతలు ఇవే

తెలంగాణ :

భూమిలేని వ్యవసాయ కూలీలకు ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ పథకం ద్వారా ప్రభుత్వం ఏడాదికి రూ. 12,000 (రెండు దశల్లో ఒక్కొక్కరికి రూ.6,000) అందిస్తోన్న విషయం తెలిసిందే.

ఈ నగదు పొందాలంటే లబ్ధిదారుడు తెలంగాణ రాష్ట్రానికి శాశ్వత నివాసి అయి ఉండాలి. భూమి లేని వ్యవసాయ కూలీ అయి ఉండాలి.

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGA) కింద 2025-26 ఆర్థిక సంవత్సరంలో కనీసం 20 రోజులు పని చేసి ఉండాలి. బ్యాంకు ఖాతా ఆధార్ కార్డుతో లింక్ చేసి ఉండాలి.