ఏపీ రాష్ట్రవ్యాప్తంగా 33,012 ఎకరాలకు ఫ్రీహోల్డ్‌ జారీ చేసిన ప్రభుత్వం

భారత్ న్యూస్ విజయవాడ…ఏపీ రాష్ట్రవ్యాప్తంగా 33,012 ఎకరాలకు ఫ్రీహోల్డ్‌ జారీ చేసిన ప్రభుత్వం

రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల గ్రామ సర్వీసు ఇనాం భూములను ఫ్రీహోల్డ్ చేస్తూ కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

తాజాగా షరతు గల (కండీషనల్) పట్టా భూములను కూడా ఫ్రీహోల్డ్ చేసింది.

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 15 జిల్లాల పరిధిలో 33,440.62 ఎకరాల కండీషనల్ పట్టా భూములు ఉంటే..

వాటిలో 33,012.35 ఎకరాలను ఫ్రీహోల్డ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

ప్రభుత్వ తాజా నిర్ణయంతో కండిషనల్ పట్టా ఉన్న భూముల్ని యజమానులు విక్రయించుకోవచ్చు.