ప్రజల సమస్యలకు ప్రాధాన్యం – సత్వర పరిష్కారమే లక్ష్యం”

భారత్ డిజిటల్ న్యూస్:జోగుళాంబ గద్వాల్ పోలీస్

“ప్రజల సమస్యలకు ప్రాధాన్యం – సత్వర పరిష్కారమే లక్ష్యం”

గ్రీవెన్స్ డేలో ప్రజలకు భరోసా ఇచ్చిన జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు, ఐపిఎస్.,

జిల్లాలో ప్రజా సమస్యలపై వేగంగా స్పందించి న్యాయం అందించినప్పుడే పోలీసుల పట్ల ప్రజల్లో నమ్మకం మరింత బలపడుతుందని జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు, ఐపిఎస్., తెలిపారు.
సోమవారం జోగుళాంబ గద్వాల్ జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల దినోత్సవం సందర్భంగా జిల్లా ఎస్పీ స్వయంగా ఫిర్యాదుదారుల నుంచి వినతులు స్వీకరించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన 10 మంది ఫిర్యాదుదారులు తమ సమస్యలను నేరుగా ఎస్పీ దృష్టికి తీసుకువచ్చారు.
ఫిర్యాదులను శ్రద్ధగా విన్న జిల్లా ఎస్పీ, సంబంధిత సర్కిల్ ఇన్స్పెక్టర్స్ తో నేరుగా మాట్లాడుతూ సంబంధిత ఎస్సై లకు వెంటనే ఫోన్ ద్వారా సూచనలు జారీ చేసి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు.

ఈరోజు వచ్చిన పిర్యాదులలో పొలానికి సంబంధించి – 3, గొడవలకు సంబంధించి – 3, భర్త హారాష్మెంట్ సంబంధించి – 1, ఇతర విషయాలకు సంబంధించి – 3, మొత్తం 10 ఫిర్యాదులు అందాయి అని తెలిపారు.

ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ…..
ప్రజలకు పోలీస్ సేవలు మరింత చేరువ చేయడమే లక్ష్యంగా, ప్రజా సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేయడం జరుగుతుందని, పోలీస్ అధికారులు, సిబ్బంది పోలీస్ స్టేషన్ కి వచ్చిన ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా ప్రవర్తించి, వినతులు, ఫిర్యాదులు స్వీకరించి, అవసరమైతే క్షేత్ర స్థాయిలో పరిశీలించి చట్ట ప్రకారం బాధితులకు న్యాయం జరిగే విధంగా చూడాలన్నారు. తద్వారా ఫిర్యాదుదారునికి పోలీస్ శాఖపై భరోసా, నమ్మకం కలుగుతుందన్నారు.

గ్రీవెన్స్ డే లో వచ్చిన ఫిర్యాదులు ఆన్ లైన్ లో పొందుపరుస్తూ ఏ మేరకు పరిష్కారం అయ్యాయో ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ప్రజలకు మరింత సమర్ధవంతంగా సేవలందించడం జరుగుతుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో గద్వాల్, అలంపూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్లు టి. శ్రీను, జి. రవిబాబు తదితరులు పాల్గొన్నారు.