జాతీయగీతాన్ని, వందేమాతర స్ఫూర్తిని ఈ దేశంలో నిలబెట్టింది ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే.

భారత్ న్యూస్ అనంతపురం,విజయవాడ

వైఎస్ షర్మిలా రెడ్డి
APCC చీఫ్

Ammiraju Udaya Shankar.sharma News Editor…జాతీయగీతాన్ని, వందేమాతర స్ఫూర్తిని ఈ దేశంలో నిలబెట్టింది ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే.

నెహ్రూ గారు ఈ దేశానికి అసలైన విశ్వాస పాత్రుడైతే..

సిసలైన విశ్వాస ఘాతకుడు నరేంద్ర మోడీ గారే.

దేశ మొదటి ప్రధానిపై మోడీ గారు చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరం.

ఇది స్వాతంత్ర్య ఉద్యమాన్ని, సమర యోధులను..

దేశ చరిత్రను తీవ్రంగా అవమానించినట్లే.

లౌకిక ప్రజాస్వామ్యాన్ని దెబ్బకొడుతునట్లే.

ప్రధాని హోదాలో పార్లమెంట్ సాక్షిగా మత విద్వేషాలను రెచ్చగొట్టినట్లే.

స్వాతంత్ర్యం కోసం 12 ఏళ్లు జైలు శిక్ష భరించిన నెహ్రూ గారి మీద..

సిద్ధించిన స్వాతంత్ర్యంలో 12 ఏళ్లుగా పదవిలో ఉంటూ ..

రాజభోగం అనుభవిస్తున్న మోడీ గారు మాట్లాడడం సిగ్గుచేటు.

మోడీ గారి మాటలు దెయ్యాలు వేదాలు వర్ణించడంతో సమానం.

బ్రిటీష్ పాలన అంతానికి జరిగిన స్వాతంత్ర్య ఉద్యమంలో బిజెపి పూర్వీకులు ఎక్కడ ?

మత ఛాందస వాదులు ఏనాడైనా వందేమాతరం ఉచ్చరించారా ?

కనీసం ఎప్పుడైనా జాతీయ పతాకానికి RSS సెల్యూట్ కొట్టిందా ?

2002 వరకు RSS కేంద్ర కార్యాలయంపై మూడు రంగుల జెండా ఎగిరిందా ?

బెంగాల్ ఎన్నికల కోసం ప్రజల మధ్య మరోసారి విభజన తెచ్చేందుకు..

విచ్ఛిన్నకర శక్తులను ఉసిగొల్పేందుకు జాతీయ గీతాన్ని వాడుకుంటున్నారు.

స్వాతంత్ర్యోద్యమ చరిత్రను పూర్తిగా వక్రీకరిస్తున్నారు.

వ్యవస్థల మీద బీజేపీ అజమాయిషీ చర్చ రాకుండా నెహ్రూజీని దోషిగా చిత్రీకరించే కుట్ర చేస్తున్నారు.

విభజించు – పాలించు సిద్ధాంతాలను మళ్లీ ఆచరిస్తున్న మోడీ గారు మరో అభినవ బ్రిటీషర్ .