నిన్న విశాఖ‌లోని రుషికొండలో భవనంలో పెచ్చులు ఊడినట్లు డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ చూపించిన పరిస్ధితిని ప్రజలు గమనించారు.

భారత్ న్యూస్ విశాఖపట్నం..Ammiraju Udaya Shankar.sharma News Editor…నిన్న విశాఖ‌లోని రుషికొండలో భవనంలో పెచ్చులు ఊడినట్లు డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ చూపించిన పరిస్ధితిని ప్రజలు గమనించారు. సుగాలీ ప్రీతి హత్య జరిగిన రెండేళ్ళ వరకు ఆమె పవన్ కు గుర్తుకు రాలేదు. వైయ‌స్‌ జగన్ ముఖ్యమంత్రి అయిన వెంటనే పవన్ కళ్యాణ్ కు సుగాలి ప్రీతి గుర్తుకు వచ్చింది. ఎన్నిసార్లు సుగాలి ప్రీతిని పవన్ కళ్యాణ్ మార్కెటింగ్ చేసుకున్నారు. అధికారంలోకి వ‌చ్చాక ఆ పాప కుటుంబానికి మీరు ఏం నాయ్యం చేశారు. సుగాలి ప్రీతి ఉసురు ప‌వ‌న్‌కు త‌గులుంది. మిస్సయిన 30 వేల మంది ఆడపిల్లల్ని పవన్ వెనక్కి తీసుకువచ్చారా? వైజాగ్ లో కూట‌మి నేత‌లు 99 పైస‌ల‌కే ఎకరాలు ఎకరాలు మీ అనుచరులకు కట్టబెడుతున్నారు. ఈ భూముల మర్మాన్ని బయటకు తీస్తాం.

-దాడిశెట్టి రాజా గారు, మాజీ మంత్రి