త్వరలోనే ఏపీ లొ అకౌంట్లోకి డబ్బులు

భారత్ న్యూస్ రాజమండ్రి …Ammiraju Udaya Shankar.sharma News Editor….త్వరలోనే ఏపీ లొ అకౌంట్లోకి డబ్బులు

📍తల్లికి వందనం పథకం పెండింగ్ దరఖాస్తులకు మంత్రి లోకేశ్ ఆమోదం తెలిపారు.

విద్యాశాఖపై సమీక్షించిన ఆయన ఈ పథకానికి సంబంధించి పెండింగ్లో ఉన్న రూ.325 కోట్లు రిలీజ్ చేసే ఫైలుపై సంతకం చేశారు.

దీంతో త్వరలోనే విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ఈ డబ్బులు జమకానున్నాయి.

అలాగే ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను వెంటనే విడుదల చేయాలని ఆదేశించారు.

ఇకపై ఏటా DSC నిర్వహించి టీచర్ ఉద్యోగాలు భర్తీ చేస్తామని మంత్రి వెల్లడించారు