భారత్ న్యూస్ హైదరాబాద్….
స్వల్ప అస్వస్థతకు గురైన రాహుల్ గాంధీ
మధ్యప్రదేశ్ :ఏప్రిల్ 21
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అస్వస్థతకు గురైనట్లు ఆపార్టీ ప్రతినిధి జైరాం రమేష్ ఆదివారం తెలిపారు.
రాహుల్ అనారోగ్యానికి గురయ్యారని, దీంతో నేడు రాంచీలో ఇండియా కూటమి నిర్వహిస్తున్న భారీ ర్యాలీలో పాల్గొనలేరని అన్నారు.
ఈ ర్యాలీలో కాంగ్రెస్ తర పున ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే హాజరవు తారని జైరాం రమేష్ ఓ ప్రకటనలో తెలిపారు. నేడు రాంచీలో నిర్వహించే ఇండియా కూటమి ర్యాలీలో భగవంత్ మాన్, లాలూ యాదవ్ సహా పలువురు ప్రతిపక్ష పార్టీల నేతలు హాజరుకానున్నారు.
రాహుల్ గాంధీ నేడు మధ్యప్రదేశ్లోని సాత్నా, జార్ఖండ్లోని రాంచీలలోని భారీ బహిరంగ సభలో ప్రసంగించాల్సి వుంది…