భారత్ న్యూస్ విజయవాడ. ఆకుల సతీష్,
పేదల బాగు కోసమే నా తపన: చంద్రబాబు
జగన్ వచ్చాక SCలు, STలకు అన్యాయం జరిగిందని చంద్రబాబు విమర్శించారు.
రాజాం సభలో మాట్లాడుతూ..
‘YCP నేతలు నాపై తప్పుడు కేసులు పెట్టి వేధించారు.
ఇప్పుడు రాళ్ల దాడి కూడా చేస్తున్నారు.
రాజకీయాల్లో లేని నా భార్య భువనేశ్వరిని అనేక మాటలన్నారు.
నేను అరెస్టయ్యాననే బెంగతో 203 మంది ప్రాణాలు వదిలారు.
ఆ కార్యకర్తల కుటుంబసభ్యులకు ఆమె ధైర్యం చెప్పారు.
ఎన్ని జరిగినా పేదల బాగు కోసమే నా తపన’ అని పేర్కొన్నారు.