మచిలీపట్నంలో ప్రజాగళం బహిరంగ సభ – 17వ తేదీ సాయంత్రం 5 గంటలకు మచిలీపట్నంలోని

భారత్ న్యూస్ విజయవాడ. ఆకుల సతీష్..కృష్ణాజిల్లా విజయవాడ:- మచిలీపట్నంలో ప్రజాగళం బహిరంగ సభ – 17వ తేదీ సాయంత్రం 5 గంటలకు మచిలీపట్నంలోని ప్రధాన కూడలి కోనేరు సెంటర్ నందు టిడిపి జనసేన బిజెపి మహాకూటమి ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామని మచిలీపట్నం జనసేన పార్టీ ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలసోరి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కొల్లు రవీంద్ర బిజెపి మచిలీపట్నం ఇంచార్జి ప్రముఖ సుప్రీంకోర్టు న్యాయవాది సోడి శెట్టి బాలాజీ తెలిపారు ఈ సభకు టిడిపి జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జనసేన పార్టీ అధ్యక్షుడు జనసేనని పవర్ స్టార్ కొణిదల పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథులుగా విచ్చేసి ప్రసంగిస్తారని రాష్ట్రం నలుమూలల నుండి నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు