బీజేపీకి తాకట్టు పెట్టారు రాష్ట్రని…నాలుగు పార్టీలు నాలుగు రకాలు

భారత్ న్యూస్ విజయవాడ:-

బీజేపీకి తాకట్టు పెట్టారు రాష్ట్రని…

నాలుగు పార్టీలు నాలుగు రకాలు…

డబ్బులు తీసుకోండి…
ఓటు కాంగ్రెస్ వేయండి…

ప్రత్యేక హోదా ఎక్కడ…
వలస వెళ్లిన ఆంధ్ర రాష్ట్రము పరిశ్రమలు

పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల

తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం సత్యవేడులోని పోలిస్టేషన్ సమీపంలో ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా పీసీసీ అధ్యక్షురాలు షర్మిల న్యాయ యాత్ర సభలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రత్యేక హోదా, ఆంధ్రకి పరిశ్రమలు తీసుకోవాస్తామని పేర్కొన్నారు, మద్యపానం నిషేధం ఎక్కడ, బూమ్ బూమ్ అంటూ ఊరకలేతించారు. ఉచ్చహంతో అన్ని హోదాలు మద్యం దుకాణంలో బాటిల్స్పైన తాకట్టు పెట్టిన జగన్ మోసగాడని హడాలేతించారు.

నేడు టిడిపి, వైకాపా, పార్టీలు ప్రత్యేక హోదాను తీసుకురాకుండా, బీజేపీకి తొత్తులుగా వ్యవహరిస్తుందని, ఈ పర్యాయం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, తమ నాయకుడు కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ అధికారంలోకి వచ్చిన వెంటనే, మొదటి సంతకం ప్రత్యేక హోదా మీద పెట్టి, ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా కల్పిస్తామన్నారు, ఇక అనేక సంక్షేమ పథకాలతో రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకుపోతామని తెలియజేశారు, ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి దిశగా తీసుకుపోవాలంuటే ఒక కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని, కాబట్టి ఈ పర్యాయం ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని కోరారు, స్థానికంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన బాలాగురు బాబుని నియోజకవర్గంలోని ప్రజలు ఆశీర్వదించి, అఖండ మెజార్టీ చేకూర్చాలని కోరారు. ఈ యాత్రలో కాంగ్రెస్ జండ్డలు ఊపి ఉచ్చహం వ్యక్తం చేసిన స్థానికులు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మరియు సత్య వేడు నియోజకవర్గ మైనార్టీ సెల్, అధ్యక్షుడు, ఎస్.కె గౌస్ మొహిద్దిన్ ఇట్లు