ఉల్లిపాలెం చూపు జనసేన వైపు..!వైసీపీ నుంచి జనసేన పార్టీలోకి భారీ చేరికలు.

భారత్ న్యూస్ అవనిగడ్డ

ఉల్లిపాలెం చూపు జనసేన వైపు..!

వైసీపీ నుంచి జనసేన పార్టీలోకి భారీ చేరికలు.

గడిచిన ఐదు సంవత్సరాల వైసిపి ప్రభుత్వం అభివృద్ధి శూన్యం
కోడూరు మండలం ఉల్లిపాలెం గ్రామస్తులు చూపు జనసేన పార్టీ వైపు చూస్తున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ క్రియాశీలక సభ్యులు స్వచ్ఛందంగా జనసేన పార్టీలోకి చేరారు.

మంగళవారం అవనిగడ్డ నియోజకవర్గ జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మండలి బుద్ధ ప్రసాద్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ కండువా కప్పుకున్నారు.

ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంలో గడిచిన ఐదు సంవత్సరాలలో అభివృద్ధి శూన్యమని ఆపదలో ఉన్న కౌలు రైతులకు నష్టపరిహారం అందించి రైతులకు అండగా నిలిచిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు ప్రతి ఒక్కరూ మద్దతు పలకాలని కోరారు.

పార్టీలు చేరిన వారిలో చందన నరసింహారావు, వడ్డీ సీతారామయ్య, బడే కుటుంబరావు, సిద్ధినేని నాంచారయ్య, కోలా ఏడుకొండలు, గుర్రం విజయ కుమార్, సిద్దినేని ముసలి, బెల్లంకొండ రత్నారావు, రావెళ్ల సాంబశివరావు, బడే పాండురంగారావు తోపాటు పలువురు జనసేన తీర్థం పుచ్చుకున్నారు.

ఈ కార్యక్రమంలో జనసేన టిడిపి నాయకులు పాల్గొన్నారు.