వలసలు జోరు..‌ వైసీపీ బేజారు,,క్రమంగా ఖాళీ అవుతున్న ఉమ్మడి మంగళం పంచాయితీ

భారత్ న్యూస్ విజయవాడ:-

వలసలు జోరు..‌ వైసీపీ బేజారు

క్రమంగా ఖాళీ అవుతున్న ఉమ్మడి మంగళం పంచాయితీ

తిరుపతి రూరల్ మండలం, రణధీర్ పురం, సప్తగిరి కాలనీ పంచాయితీల నుంచి టీడీపీలోకి వలసలు జోరందుకున్నాయి. ఆదివారం చంద్రగిరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని తనయుడు పులివర్తి వినీల్ ఆధ్వర్యంలో రణధీర్ పురం పంచాయతీ నుంచి వైసీపీ నేతలు మస్తాన్, దనపాల్, సోమశేఖర్, జయకుమార్, సురేష్, ప్రకాష్, బుజ్జి,చంద్ర, ముని రెడ్డి, చినరాజులు సప్తగిరి కాలనీ పంచాయితీ నుంచి బాలనాగి రెడ్డి, సుదర్శన్ రెడ్డి, పురుషోత్తం రెడ్డి, సాయి కిషోర్, ఢిల్లీ తదితరులు తెలుగుదేశం పార్టీలో చేరారు. వైసీపీ పాలనలో విసిగి వేసారి పోయామని కష్టాలు, బాధలు తప్ప భవిష్యత్తుకు భరోసా లేదని భావించి టీడీపీ సిద్దాంతాలు, హుందా రాజకీయాలు, పులివర్తి నాని పోరాట పటిమ మిమ్మల్ని పార్టీలో చేరాలా చేశాయని తెలిపారు. ప్రతి బూత్ లో మెజార్టీ చూపిస్తామని ధీమా వ్యక్తం చేశారు.