భారత్ న్యూస్ శ్రీకాకుళం…..మోకాళ్లపై పాకుతూ వెంకన్న దర్శనానికి..!
కూతురు ఆరోగ్యం బాగుండాలని మూడు కిలోమీటర్లు మోకాళ్ళపై పాకుతూ ఒక తల్లి వెంకన్న దర్శనానికి వెళ్ళి తన భక్తిపారవశ్యాన్ని చాటుకుంది.
శనివారం కోడూరు శివారు శ్రీరాంపురం గ్రామానికి చెందిన కన్నా మౌనిక తన కుమార్తె ఆరోగ్యం బాగుండాలని కోరుతూ శ్రీరాంపురం లోని తన నివాసం వద్ద నుంచి కోడూరు వెంకటేశ్వర స్వామి వారి ఆలయం వద్దకు మోకాళ్ళ పై పాకుతూ వెళ్లి స్వామిని దర్శించుకుంది.
తన కూమార్తె కు రెండు నెలల క్రితం పాము కరిచి ఆరోగ్యం క్షీణించిదని ,తన కుమార్తె ఆరోగ్యం మెరుగుపడితే వెంకన్న దర్శనానికి మోకాళ్లపై వస్తానని మొక్కుకున్నారని, తన కుమార్తె ఆరోగ్యం మెరుగుపడినందున మోక్కును తీర్చుకున్నట్లు మౌనిక తెలిపారు.
