భారత్ న్యూస్ విజయవాడ…ఏపీ ఉద్యోగులకు గుడ్ న్యూస్
అమరావతి :
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ రంగ సంస్థలు (PSUs), కార్పొరేషన్లు, సొసైటీల ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ జీవో జారీ చేసింది. దీనివల్ల పదవీ విరమణ చేసిన అర్హులైన ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకునే అవకాశం ఉంది. 62 ఏళ్ల వరకు పనిచేసే వారికి పూర్తి సర్వీస్ బెనిఫిట్స్ అందనున్నాయి. ఈ నిర్ణయంపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
