కర్రెగుట్టల్లో హైటెన్షన్

భారత్ న్యూస్ విశాఖపట్నం..కర్రెగుట్టల్లో హైటెన్షన్

కర్రెగుట్లలో మరోసారి హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ములుగు జిల్లా ముకునూరుపాలెం అటవీ ప్రాంతంలో ప్రెజర్ బాంబ్ పేలడంతో బలగాలు అప్రమత్తమయ్యాయి. కర్రెగుట్ట శివారు ప్రాంతాలను జల్లడ పడుతున్నారు. అనుమానితులు సంచరిస్తున్నారనే సమాచారం అందడంతో బలగాలు అక్కడికి చేరుకుని కూంబింగ్ నిర్వహిస్తున్నారు. కాగా మావోయిస్టుల్లో ప్రముఖులను ఆపరేషన్ కగార్ పేరుతో హతమార్చిన విషయం తెలిసిందే. కొంతమంది పోలీసుల ఎదుట కూడా లొంగిపోయారు.