ఏపీలో ప్రభుత్వ బడుల్లో ఎన్రోల్మెంట్ డ్రైవ్

భారత్ న్యూస్ శ్రీకాకుళం..ఏపీలో ప్రభుత్వ బడుల్లో ఎన్రోల్మెంట్ డ్రైవ్

అమరావతి :

ఏపీలోని ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య పెంచడం లక్ష్యంగా ఎన్రోల్మెంట్ డ్రైవ్ చేపట్టాలని సమగ్రశిక్ష స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాసరావు ఆదేశాలిచ్చారు. విద్యార్థుల సంఖ్య పెంచడంతోపాటు బడి మానేసిన పిల్లలను తిరిగి చేర్పించాలన్నారు. ఇందుకోసం ఇంటింటి సర్వే చేపట్టాలని, జూలై 12వరకు డ్రైవ్ కొనసాగాలని ఆదేశించారు. 6-14 ఏళ్ల పిల్లలను కచ్చితంగా బడుల్లో చేర్చడం ఈ డ్రైవ్ లక్ష్యంగా ఆయన పేర్కొన్నారు.