ఎలా బతికానో తెలియడం లేదు: రమేశ్ విశ్వాస్

భారత్ న్యూస్ ఢిల్లీ…..ఎలా బతికానో తెలియడం లేదు: రమేశ్ విశ్వాస్

విమాన ప్రమాదం నుంచి ఎలా బతికానో తెలియడం లేదని మృత్యుంజయుడు రమేశ్ విశ్వాస్ తెలిపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ప్రమాదం తర్వాత తొలిసారి మీడియాతో మాట్లాడారు.

‘టేకాఫ్ అయిన 30సెకన్ల తర్వాత విమానం పెద్ద శబ్దంతో కూలిపోయింది. నేను స్పృహలోకి వచ్చేసరికి చుట్టూ మృతదేహాలున్నాయి. విమానం ముక్కలు చెల్లాచెదురుగా పడ్డాయి. ఎవరో నన్ను అంబులెన్స్ ఎక్కించారు. నా సోదరుడూ విమానంలో ప్రయాణించాడు’ అని అన్నారు.