.భారత్ న్యూస్ హైదరాబాద్….మంత్రి పొన్నం ప్రభాకర్ గారి విజ్ఞప్తి మేరకు తిరుపతికి ప్రత్యేక రైలు ప్రారంభం
కరీంనగర్ నుండి తిరుపతి , తిరుపతి నుండి కరీంనగర్ కి వెళ్ళే రైలు ను నిత్యం నడిపించాలని ఇప్పటికే పలుమార్లు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కు మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు.ఈ రైలు ద్వారా తిరుపతి వెళ్ళే ఉత్తర తెలంగాణ ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు.
గత నెల 22 న కరీంనగర్ రైల్వే స్టేషన్ పునః ప్రారంభం సందర్భంగా తిరుపతి రైలు పై కేంద్ర మంత్రి బండి సంజయ్ కి మంత్రి పొన్నం ప్రభాకర్ మరోసారి విజ్ఞప్తి చేశారు.మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తికి స్పందించిన రైల్వే శాఖ కరీంనగర్ నుండి తిరుపతి కి వెళ్ళే రైలు సేవలను పెంచుతూ ఈరోజు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ ప్రత్యేక రైలు జూలై 6 నుండి జూలై మధ్య నడిపించనున్నారు. ఇది ప్రతి ఆదివారం రాత్రి 7:45 గంటలకు తిరుపతి నుండి బయలుదేరి సోమవారం ఉదయం 10:00 గంటలకు కరీంనగర్ చేరుకోనుంది.సోమవారం సాయంత్రం 5:30 కి కరీంనగర్ నుండి బయలుదేరి మంగళవారం ఉదయం 8:25 కి తిరుపతి చేరుకోనుంది.
ఈ ప్రత్యేక రైలు ప్రయాణికుల రద్దీని బట్టి రెగ్యులర్ గా నడిచే అవకాశం ఉంటుంది. కరీంనగర్ నుండి తిరుపతి కి ప్రత్యేక రైలు వేసిన రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, సహకరించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ లకు మంత్రి పొన్నం ప్రభాకర్ ధన్యవాదాలు తెలిపారు. ఈ ప్రత్యేక రైలును ఉత్తర తెలంగాణ జిల్లాల ప్రజలు ఉపయోగించుకోవాలని కోరారు.