భారత్ న్యూస్ ఢిల్లీ…..అమెరికా తర్వాత రెండో స్థానం మనదే!
స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ తాజా అధ్యయనం ప్రకారం.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో భారత్ ప్రపంచ వేదికపై సత్తా చాటుతోంది. అత్యధిక సంఖ్యలో ఏఐ రచయితలు, ఆవిష్కర్తలు కలిగిన దేశాల్లో అమెరికా తర్వాత భారత్ రెండో స్థానంలో నిలిచింది. గతేడాది 50,460 మంది నిపుణులతో భారత్ ఈ ఘనత సాధించడమే కాకుండా.. ఏఐ రంగంలో ఏకంగా 4.09 బిలియన్ డాలర్ల ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించింది. ఏఐ అభివృద్ధిలో భారత్ గ్లోబల్ హబ్ గా ఎదుగుతోంది.
