భారత్ న్యూస్ విశాఖపట్నం..ఏపీలో భూముల మార్కెట్ విలువ పెంపు.. ఫిబ్రవరి 1 నుంచి అమలు

Ammiraju Udaya Shankar.sharma News Editor…ఏపీలో భూముల మార్కెట్ విలువను ప్రభుత్వం మరోసారి పెంచింది.
ఈ సవరించిన విలువలు ఫిబ్రవరి 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. రెవెన్యూ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సాయి ప్రసాద్ ఈ మేరకు మెమో జారీ చేశారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది రెండోసారి భూముల మార్కెట్ విలువల పెంపు.
ఈ పెంపుతో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ విభాగం ద్వారా ప్రభుత్వ ఆదాయం గణనీయంగా పెరిగే అవకాశం ఉంది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.13,150 కోట్లకు పైగా ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు.