భారత్ న్యూస్ డిజిటల్:అమరావతి:
పల్నాడు జిల్లా పోలీస్,
నరసరావు పేట రూరల్ పి.ఎస్
// కార్ల దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు ముద్దాయి లను అరెస్టు చేసిన నరసరావుపేట రూరల్ పోలీసులు//
🚩 ఈ రోజు (22.12.2025) నరసరావుపేట రూరల్ పి.ఎస్ నందు నిర్వహించిన మీడియా సమావేశంలో దొంగల అరెస్ట్ వివరాలను వెల్లడించిన పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ బి. కృష్ణారావు ఐపిఎస్ గారు,.
👉 ఈ సందర్భంగా గౌరవ ఎస్పీ గారు మాట్లాడుతూ….
- ఈ నెల 12 న విజయవాడకి చెందిన శ్రీనివాసరెడ్డి తన కారు పోయిందని ఫిర్యాదు చేశారు.
- నరసరావుపేట వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది.
- ఫైనాన్స్ చెల్లించే క్రమంలో ఈ కార్లు చోరీలకు పాల్పడుతున్నారు. • ఈ మొత్తం వ్యవహారంలో తొమ్మిది మంది పాత్ర ఉన్నట్లు విచారణలో తేలింది. • వెంకట నాయుడు, అంజి,భాను ప్రకాష్,రఫీ లను ఇప్పటికే అరెస్ట్ చేసినట్లు తెలిపారు.
- కేసులో ప్రమేయం ఉన్న మిగిలిన నిందితులను త్వరలోనే అరెస్ట్ చేస్తాం.
- ప్రస్తుతం 20 కార్లను స్వాధీనం చేసుకోవడం జరిగింది.
- ఫైనాన్స్ లో కార్లు కొనుగోలు చేసి తిరిగి డబ్బులు చెల్లించని వారి నుండి కార్లు తీసుకుని నంబర్ ప్లేట్లు మార్చుకొని తిరగడం జరుగుతుంది.
🔰 అరెస్టు కాబడిన ముద్దాయిల వివరాలు
- పుల్లంశెట్టి భాను ప్రకాష్ తండ్రి సాంబశివరావు, 28 సం, కులం:కాపు నర్సింగపాడు గ్రామం, నకరికల్లు మండలం.(A1)
- పుల్లంశెట్టి ఆంజనేయులు @ అంజి నాయుడు, తండ్రి రామారావు,
44 సం,కులం:కాపు నర్సింగపాడు గ్రామం,నకరికల్లు మండలం(A2) - షేక్ మొహమ్మద్ రఫీ తండ్రి నాగుల్ మీరా, 39 సం, కులం:ముస్లిం, చిన్న మసీద్ సెంటర్, గురజాల గ్రామం & మండలం (A3).
- మధ్యాహ్నపు మోహన సత్య శ్రీనివాస్ తండ్రి సత్యనారాయణ, 40 సం,కులం : కాపు, బాచుపల్లి, హైదరాబాద్ (A5)
🔰 కేసు వివరాలు :-
ది.12/12/2025 వ తేదీన విజయవాడ అయ్యప్ప నగర్ కు చెందిన ఫిర్యాది పుల్ల శ్రీనివాసరెడ్డి 2024 వ సంవత్సరం ఆగస్టు నెలలో పుల్లంశెట్టి ఆంజనేయులు @ అంజి నాయుడు(A2) తన యొక్క Swift AP40AZ4419 నెంబర్ గల కారును లక్ష యాభై వేల రూపాయలకు తన వద్ద తాకట్టు పెట్టినట్లు తాను అసలు వడ్డీ చెల్లించి వాహనం తీసుకుని వెళతాను అంటే ఇవ్వకుండా దాని నెంబర్ మార్చి వాడుకుంటున్నట్లు,
నరసరావుపేట రూరల్ పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు చేయగా పోలీసు వారు Cr.No : 304/2025 U/Sec 318(4),316(2),351(2),338,336(3),340(2),61(2),308(5),111 r/w 3(5) BNS గా కేసు నమోదు చేసి దర్యాప్తు చేసే క్రమంలో ఈరోజు ఉదయం 8 గంటల సమయంలో నరసరావుపేట రూరల్ ఎస్సై గారు వారి సిబ్బంది పుల్లంశెట్టి ఆంజనేయులు తోపాటు పుల్లంశెట్టి భాను ప్రకాష్ (A1), గురజాల కు చెందిన షేక్ మహమ్మద్ రఫీ (A3), హైదరాబాద్ కు చెందిన మధ్యాహ్నపు సత్య శ్రీనివాస్ (A5) అను వారిని అదుపులోకి తీసుకొని వారు అమ్ముకొనుటకు తీసుకొని వెళుతున్న మూడు కార్లను చెక్ చేయగా దానికి సంబంధించిన ఎలాంటి కాగితాలు లేనందున సదరు కార్లను స్వాధీన పరచుకొని అరెస్టు చేయడం జరిగింది. అదేవిధంగా పుల్లంశెట్టి భాను ప్రకాష్ (A1) మరియు మిగతా ముద్దాయిలు దాచి ఉంచిన 10 కార్లను ముద్దాయికి చెందిన కొండమోడు సమీపంలోని గెస్ట్ హౌస్ వద్ద స్వాధీనపర్చుకోవడం జరిగింది.అదేవిధంగా పుల్లంశెట్టి ఆంజనేయులు (A2) పాలపాడు రోడ్డులోని వెంచర్ వద్ద అందరూ ముద్దాయిలు కలిసి దాచి ఉంచిన 7 కార్లను స్వాధీన పరచుకోవడం జరిగింది.అదేవిధంగా పుల్లంశెట్టి భాను ప్రకాష్ (A1) వద్ద రెండు స్పేర్ నెంబర్ ప్లేట్లను కూడా స్వాధీనపర్చుకోవడం జరిగింది.
🔰 అరెస్టు కావలసిన ముద్దాయిల వివరాలు
- పానుగంటి రామకృష్ణ @ RK,నకరికల్లు గ్రామం మరియు మండలం (A4)
- హైదరాబాదు కు చెందిన ప్రకాష్ గౌడ్ (A6)
- వైజాగ్ కు చెందిన వర్మ (A7)
- మదమంచి వెంకట అనుజ్ఞ నాయుడు చిట్టి నాయుడు @ వెంకట నాయుడు (A8)
- పుల్లంశెట్టి మహేష్ బాబు (A9)
🔰 నిందితుల నేర ప్రవృత్తి :-
ఈ మొత్తం 20 కార్లను నిందితులు అందరూ కలిసి కార్లను తాకట్టు పెట్టుకునే క్రమంలో ఒకరికొకరు సహకరించుకుంటూ ఒక ముఠాగా ఏర్పడి కార్ల తాకట్టు ద్వారా, అద్దెల ద్వారా, ఫైనాన్స్ ఎగ్గొట్టడం ద్వారా వచ్చిన డబ్బులను సమానంగా పంచుకొని త్రాగి తిరుగుకుంటూ కార్లకు సంబంధించిన కాగితాలను వారికి హైదరాబాద్ కు చెందిన ప్రకాష్ గౌడ్, మోహన సత్య శ్రీనివాస్ మరియు వైజాగ్ కు చెందిన వర్మలు వారికి పంపించి సహకరిస్తున్నట్లు, నిందితులు తాకట్టు పెట్టుకున్న కార్లకు శ్రీరామ్ ఫైనాన్స్, మహావీర్ ఫైనాన్స్, IKF ఫైనాన్స్, IDFC First Bank Limited ఫైనాన్స్ వద్ద నుండి ఫైనాన్స్ తీసుకుని అందుకు సంబంధించిన వడ్డీ లను కట్టకుండా, నెలవారీ కిస్తీ లను కూడా ఎగ్గొట్టుటకు మరియు ఆ డబ్బును ఎక్కువ వడ్డీలకు ఇస్తూ అధిక వడ్డీలకు వాహనాలు అమ్ముట, నెలవారీ కిస్తీలు కట్టకుండా ఎగవేస్తూ ఉంటారు. అంతేకాకుండా నిందితులు అందరూ ఫైనాన్స్ వారికి దొరకకుండా నెంబర్ ప్లేట్లు మార్చి కొత్త నెంబర్లు వేస్తూ మరియు ఏదైనా పాడైపోయిన వాహనాల యొక్క రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ వేసి వాహనాలను తిప్పుతూ వచ్చిన ఆదాయమును అందరూ సమానంగా పంచుకుంటూ ఉంటున్నట్లు, అంతేకాకుండా అవకాశం కుదిరినప్పుడు కార్ల యొక్క ఇంజన్ నెంబర్లు మరియు ఛాసిస్ నెంబర్లు మార్చాలని అనుకొని కొన్ని కార్ల నెంబర్లు మరియు యజమానుల చిరునామాలు మార్చినట్లు, సదరు కార్ల యజమానులు కార్లు ఇవ్వమని దానికి సంబంధించిన అసలు వడ్డీ కంటే కూడా ఎక్కువ వడ్డీ ఇవ్వమని డిమాండ్ చేస్తూ వారు అంత వడ్డీ ఇవ్వలేము అంటే వారిని బెదిరించి వారి వద్ద నుండి బలవంతంగా అగ్రిమెంట్లు తీసుకుంటున్నట్లు, అదే విధంగా నిందితులు 20 కార్లను తీసుకొని వాటిలో కొన్నిటిని నెంబర్లు మార్చి, కొన్నిటికి ఫైనాన్స్ ఎగ్గొట్టి, ఒక వాహనం రిజిస్టర్ నెంబర్ మరొక వాహనానికి మార్చినట్లు విచారణలో తేలింది.

👉 ఈ దర్యాప్తులో దిశా నిర్దేశం చేసినటువంటి నరసరావుపేట డిఎస్పి M. హనుమంతరావు గారిని, దర్యాప్తు చేసిన నరసరావుపేట రూరల్ సీఐ MV. సుబ్బారావు గారిని, నరసరావుపేట రూరల్ ఎస్సై Ch. కిషోర్ గారిని, ఎస్సై R. శ్రీకాంత్ గారిని, ఎస్సై SK. ఫాతిమా గారిని మరియు సిబ్బందిని జిల్లా ఎస్పీ శ్రీ బి.కృష్ణారావు, ఐపీఎస్ గారు అభినందించారు.