భారత్ న్యూస్ అనంతపురం…రైలులో అత్యాచారం’ కేసు నిందితుడి విచారణలో వెల్లడి గతంలో కేరళ మహిళపై అఘాయిత్యానికి పాల్పడినట్లు అంగీకారం
నిందితుడు రాజారావు.
ఐదు రోజుల క్రితం సత్రాంగచ్చి-చర్లపల్లి ప్రత్యేక రైలులో మహిళపై అత్యాచారం కేసుకు సంబంధించి పోలీసు దర్యాప్తులో అనేక అంశాలు వెల చూస్తున్నాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. అత్యాచారం అనంతరం నిందితుడు రాజారావు పెదకూరపాడు రైల్వేస్టేషన్ సమీపంలో రైలు నెమ్మదిగా వెళ్తుండడంతో అక్కడ దిగిపోయి పత్తి చేల మీదుగా నడుచుకుంటూ వెళ్లి సత్తెనపల్లి బస్సెక్కాడు. బాధితురాలి నుంచి గుంజుకున్న సెల్ఫోన్ను అక్కడ విక్రయించి వచ్చిన డబ్బుతో బిర్యానీ తిన్నాడు. అనంతరం అక్కడే రైలెక్కి గుంటూరు వచ్చి నగర వీధుల్లో రెండుగంటలపాటు చక్కర్లు కొట్టాడు. తరువాత మరో రైలెక్కి తెనాలిలో దిగాడు. బాధితురాలి సిమ్కార్డును తన ఫోన్లో వాడడంతో టవర్ లొకేషన్ ద్వారా పోలీసులు గుర్తించి పట్టుకున్నారు. గత మూడు రోజుల విచారణల నిందితుడు అనేక అంశాలు వెల్లడించినట్టు తెలిసింది. ఎనిమిది నెలల క్రితం కేరళకు చెందిన ఓ మహిళపైనా అఘాయిత్యానికి పాల్పడినట్టు అంగీకరించడంతో ఆ దిశగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆది, సోమవారాలు సెలవు కావడంతో నిందితుడిని మంగళవారం కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.
