లొంగిపోయిన ఇద్దరు లష్కరే ఉగ్రవాదులు

భారత్ న్యూస్ ఢిల్లీ…లొంగిపోయిన ఇద్దరు లష్కరే ఉగ్రవాదులు

జమ్మూకశ్మీర్‌లో ఇద్దరు లష్కరే తోయిబా ఉగ్రవాదులు లొంగిపోయారు. ఇర్ఫాన్‌ బషీర్‌, ఉజైర్‌ సలామ్‌ లొంగిపోయారని షోపియాన్‌ పోలీసులు ప్రకటించారు. వారి నుంచి రెండు ఏకే 56 రైఫిళ్లు, 4 మ్యాగజైన్లు, 102 రౌండ్స్‌, 2 హ్యాండ్‌ గ్రనేడ్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పహల్గాం దాడి తర్వాత ఉగ్రవాదాన్ని అంతమొందించేందుకు భారత బలగాలు కఠిన చర్యలు చేపడుతున్నాయి.