జులై 17, 18న విశాఖలో పర్యటించనున్న రాజ్‌నాథ్‌ సింగ్‌

…….భారత్ న్యూస్ అమరావతి..Ammiraju Udaya Shankar.sharma News Editor…జులై 17, 18న విశాఖలో పర్యటించనున్న రాజ్‌నాథ్‌ సింగ్‌

ఆంధ్రప్రదేశ్ :

జులై 17, 18 తేదీల్లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ విశాఖలో పర్యటించనున్నారు.

పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మితమైన కొత్త INS నిస్తార్‌ యుద్ధనౌకను కొత్త జులై 18న నేవల్‌ డాక్‌యార్డులో రాజ్‌నాథ్‌ ప్రారంభించనున్నారు.

విశాఖపట్నం కేంద్రంగా నిస్తార్‌ సేవలలందించనుంది.

భారత్‌-పాక్‌ యుద్ధ సమయంలో విశాఖతో సహా తూర్పు తీరాన్ని నాశనం చేయడానికి వచ్చిన పీఎన్‌ఎస్‌ ఘాజీ జలాంతర్గామిని అప్పటి ఐఎన్‌ఎస్‌ నిస్తార్‌ యుద్ధనౌక ధ్వంసం చేసింది.