విశాఖలో ఐటీ క్యాంపస్ ఏర్పాటు: కాగ్నిజెంట్

భారత్ న్యూస్ విశాఖపట్నం.విశాఖలో ఐటీ క్యాంపస్ ఏర్పాటు: కాగ్నిజెంట్

విశాఖపట్నం :

ఆంధ్రప్రదేశ్ లోని విశాఖలో కొత్త IT క్యాంపస్ ఏర్పాటు చేయబోతున్నట్లు కాగ్నిజెంట్ సంస్థ ప్రకటించింది. కాపులుప్పాడలో 22 ఎకరాల్లో ఈ క్యాంపస్ ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొంది. దీని ద్వారా Al, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ రంగాల్లో సుమారుగా 8 వేల మందికి పైగా ఉద్యోగావకాశాలు లభిస్తాయని తెలిపింది. 2026 నుంచి కార్యకలాపాలు ప్రారంభిస్తామని, 2029 నాటికి తొలిదశ పూర్తిచేస్తామని ప్రకటించింది. ఇందుకు సహకరించిన సీఎం చంద్రబాబు, లోకేశ్ కు కృతజ్ఞతలు తెలిపింది.