భారత్ న్యూస్ గుంటూరు…తెలుగుదేశం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా కనపర్తి శ్రీనివాసరావు..
అవనిగడ్డ నాయకుల ఘన సత్కారం
నేడు ప్రకటించిన తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీలో, అవనిగడ్డ నియోజకవర్గ పరిశీలకులు కనపర్తి శ్రీనివాసరావు రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా అవనిగడ్డ నియోజకవర్గ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు ఆయనను అవనిగడ్డ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పూలమాలలు, శాలువాలతో ఘనంగా సత్కరించి, శుభాకాంక్షలు తెలియజేశారు.
