తిరుచానూరు పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత

భారత్ న్యూస్ తిరుపతి…తిరుపతి జిల్లా..

తిరుచానూరు పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత

పద్మావతి అమ్మవారు ఆలయం వాహన బేరర్ లు పై దాడి కేసులో 19 మందిపై కేసు నమోదు

తమ వారిపై అక్రమంగా పోలీసులు కేసులు నమోదు చేశారంటూ నిరసనకు దిగిన మహిళలు

పోలీసు స్టేషన్ ఎదుట రోడ్డుపై బైఠాయించిన వైనం

ఎమ్మెల్యే డౌన్ డౌన్..ఎస్పీ డౌన్ డౌను అంటూ నినాదాలు చేసిన మహిళలు

కక్షపూరితంగానే తమ వారిపై కేసులు నమోదు చేశారంటూ ఆగ్రహం

ఎమ్మెల్యే నాని ఆదేశాలతోనే అక్రమంగా అరెస్టులు

ముందుగా దాడి చేసిన వారిపై ఎందుకు కేసు నమోదు చేయలేదంటూ పోలీసులను నిలదీసిన మహిళలు

ఫిర్యాదు చేసేందుకు వచ్చిన వారినే అరెస్టు చేయడం ఏమిటంటూ నిలదీసిన మహిళలు

వాహనాల రాకపోకలకు అడ్డంగా బైఠాయించి బాధిత కుటుంబ సభ్యులు

పోలీసుల తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన

కేవలం రాజకీయ కక్షలతోనే తమవారిని వేధిస్తున్నారంటూ ఆగ్రహం