భారత్ న్యూస్ ఖమ్మం…..ఇక పై గంట ఆలస్యంగా రూ.10,000 పైన డిజిటల్ చెల్లింపులు!
దేశంలో పెరుగుతున్న డిజిటల్ మోసాలను అరికట్టేందుకు RBI కీలక ప్రతిపాదన చేసింది. రూ.10,000 అంతకంటే ఎక్కువ విలువైన UPI లావాదేవీలను ప్రాసెస్ చేయడానికి ఒక గంట నిరీక్షణ సమయం (డిలే) విధించాలని భావిస్తోంది. ఈ సమయంలో వినియోగదారులు అనుమానాస్పద లావాదేవీలను రద్దు చేసుకోవచ్చు. అయితే మర్చంట్ పేమెంట్స్, సబ్స్క్రిప్షన్లు, లోన్
ఈఎంఐలకు ఈ నిబంధన నుంచి మినహాయింపు ఉంటుందని ఆర్బీఐ తెలిపింది.
