ఏప్రిల్ 10 నుంచి యూపీఐ తప్పనిసరి

భారత్ న్యూస్ గుంటూరు…ఏప్రిల్ 10 నుంచి యూపీఐ తప్పనిసరి

డిజిటల్ చెల్లింపుల్లో మరో కీలక అడుగు పడనుంది. దేశవ్యాప్తంగా టోల్ ప్లాజాల వద్ద నగదు చెల్లింపులను కేంద్ర ప్రభుత్వం పూర్తిగా నిషేధించింది. ఏప్రిల్ 10 నుంచి వాహనదారులు కేవలం ఫాస్టాగ్ లేదా యూపీఐ ద్వారా మాత్రమే టోల్ చెల్లించాల్సి ఉంటుంది. ట్రాఫిక్ రద్దీని తగ్గించి.. లావాదేవీల్లో పారదర్శకత పెంచడమే ఈ నిర్ణయం ప్రధాన లక్ష్యం.

నిబంధనలు ఉల్లంఘించే వారికి నేరుగా ఈ-నోటీసులు పంపనుంది.