అన్నమయ్య జిల్లా: విద్యార్థినుల రక్షణకు ‘డ్రోన్’ నిఘా

భారత్ న్యూస్ అనంతపురం..అన్నమయ్య జిల్లా: విద్యార్థినుల రక్షణకు ‘డ్రోన్’ నిఘా

మదనపల్లె జిల్లాలో విద్యార్థినుల భద్రతే లక్ష్యంగా పోలీస్ శాఖ సరికొత్త టెక్నాలజీని రంగంలోకి దించింది. జిల్లా ఎస్పీ ధీరజ్ ఆదేశాల మేరకు, విద్యాసంస్థల వద్ద ఆకతాయిల ఆగడాలకు చెక్ పెట్టేందుకు శక్తి బృందాలు డ్రోన్లతో నిఘా (Drone Surveillance) ప్రారంభించాయి.

పాఠశాలలు, కళాశాలల ప్రారంభం మరియు ముగింపు సమయాల్లో డ్రోన్ల ద్వారా పరిసరాలను జల్లెడ పడుతున్నారు. ఎవరైనా అనుమానాస్పదంగా తిరిగినా, విద్యార్థినులను వేధించినా వెంటనే గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. సాంకేతికతను జోడించి మహిళలకు భరోసా కల్పిస్తున్న పోలీసుల నిర్ణయంపై తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిరంతరం నిఘా కొనసాగుతుందని జిల్లా పోలీస్ శాఖ స్పష్టం చేసింది.