తెలంగాణ ఏర్పడిన తరువాత మొదటిసారి టార్గెట్ చేరుకోలేకపోయిన సింగరేణి

భారత్ న్యూస్ వరంగల్….. ….తెలంగాణ ఏర్పడిన తరువాత మొదటిసారి టార్గెట్ చేరుకోలేకపోయిన సింగరేణి

భారీ అవినీతితో నష్టాల అంచుల్లో సింగరేణి సంస్థ

కేసీఆర్ ప్రభుత్వంలో రికార్డు స్థాయిలో 70 మిలియన్ టన్నుల బొగ్గు వెలికితీసిన సింగరేణి, ఈ ఏడాది 58 మిలియన్ టన్నులకే పరిమితమయ్యింది

మొదలు 76 మిలియన్ టన్నుల లక్ష్యాన్ని నిర్దేశించగా, ఆ లక్ష్యాన్ని చేరుకునే అవకాశం లేక 60 మిలియన్ టన్నుల లక్ష్యానికి తగ్గించిన సంస్థ

కానీ నిర్దేశించిన లక్ష్యం కంటే తక్కువగా కేవలం 58 మిలియన్ టన్నుల బొగ్గు మాత్రమే వెలికితీయడంతో ఈ ఏడాది అసలు లాభాలు వస్తాయా రావా అనే సందిగ్ధంలో పడిన సింగరేణి యాజమాన్యం.

కేసీఆర్ హయాంలో వెలుగులు విరజిమ్మిన సింగరేణి ఇప్పుడు రేవంత్ పరిపాలనలో అస్తవ్యస్తం అయిపోయింది