ఇక రాపిడో డ్రైవరే మీ గైడ్.. ఏపీ పర్యాటక శాఖ సరికొత్త ప్రయోగం!

భారత్ న్యూస్ అనంతపురం..ఇక రాపిడో డ్రైవరే మీ గైడ్.. ఏపీ పర్యాటక శాఖ సరికొత్త ప్రయోగం!* తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ, రాపిడోతో భాగస్వామ్యం కుదుర్చుకుంది.ఆటో, క్యాబ్ డ్రైవర్లను రాష్ట్ర సాంస్కృతిక రాయబారులుగా మార్చే లక్ష్యంతో ‘డ్రైవర్-కమ్-గైడ్’ శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఫిబ్రవరి 24న విజయవాడలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించిన విషయం తెలిసిందే. డ్రైవర్లను ప్రయాణికులను తీసుకెళ్లడానికి మాత్రమే కాకుండా.. ఈ ప్రాంత గొప్ప చరిత్ర, వారసత్వం, పర్యాటక ఆకర్షణలను కూడా పరిచయం చేస్తారు.

Ammiraju Udaya Shankar.sharma News Editor…ఆటో నగర్‌లోని పర్యాటక శాఖ కార్యాలయంలో జరిగిన రెండు రోజుల శిక్షణా సెషన్‌లో 32 మంది క్యాబ్ డ్రైవర్లు, 248 ఆటో డ్రైవర్లతో సహా 280 మంది డ్రైవర్లు.. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ప్రాజెక్ట్స్) శేషగిరి రావు, మార్కెటింగ్ సీఈఓ పద్మరాణి శీల పర్యవేక్షణలో నిర్మాణాత్మక సెషన్‌లలో పాల్గొన్నారు. ఈ శిక్షణలో కీలకమైన పర్యాటక ప్రదేశాలు, వృత్తిపరమైన ప్రవర్తన, భద్రతా ప్రమాణాలు, సందర్శకుల అనుభవాన్ని మెరుగుపరచడానికి సాంకేతికతను ఉపయోగించడం వంటివి ఉన్నాయి. టూరిస్టులతో ఎలా ఉండాలో కూడా ఇందులో ఉంటుంది.

అంతర్జాతీయ పర్యాటకులతో సమర్థవంతంగా కమ్యూనికేట్ చేయడానికి ‘భాషిణి’ యాప్, గూగుల్ ట్రాన్స్‌లేట్ వంటి ట్రాన్స్‌లేష్ చేసే సాధనాలను ఉపయోగించడానికి డ్రైవర్లకు శిక్షణ ఇచ్చారు. జిగ్నాస ఆర్ట్‌వర్స్ మద్దతుతో పాల్గొన్నవారికి చారిత్రక ప్రాముఖ్యతను ఆకర్షణీయంగా వివరించడానికి స్టోరీ టెల్లింగ్‌పై శిక్షణ కూడా ఇచ్చారు. అమరావతి, బౌద్ధ సర్క్యూట్, నాగార్జున సాగర్ వంటి గమ్యస్థానాలపై ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారు.

పర్యాటకులు సర్టిఫైడ్ డ్రైవర్లను గుర్తించడంలో సహాయపడటానికి, రాపిడో దాని యాప్‌లో ప్రత్యేకమైన టూరిస్ట్ గైడ్ సింబల్‌ను ప్రవేశపెట్టింది. ఇది సురక్షితమైన, మరింత సమాచార ప్రయాణ అనుభవం కోసం శిక్షణ పొందిన గైడ్ డ్రైవర్లను బుక్ చేసుకోవడానికి టూరిస్టులకు అనుమతిస్తుంది. బుక్ చేసుకునేటప్పుడే వారికి ఒక క్లారిటీ ఉంటుంది.

నాగార్జున సాగర్ కోసం ఛాలెంజ్-బేస్డ్ డెస్టినేషన్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌లో భాగంగా కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ స్వదేశ్ దర్శన్ పథకం కింద ఈ ప్రాజెక్ట్ అమలు అవుతోంది. విజయవాడ పైలట్ మార్చి 6న ముగియనున్నందున, ఇప్పటివరకు వచ్చిన రెస్పాన్స్‌ను తెలుసుకుని, ఈ ప్రాజెక్టును తిరుపతి, విశాఖపట్నంలకు విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది.