ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్.. మావోయిస్టు అగ్రనేత మృతి…

భారత్ న్యూస్ విజయవాడ…ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్.. మావోయిస్టు అగ్రనేత మృతి…

ఛత్తీస్‌గఢ్ బీజాపూర్ జిల్లా, పెద్ద గలూరు అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు, నక్సలైట్ల మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. ఎన్‌కౌంటర్‌లో నక్సలైట్ కమాండర్ ఉధమ్ సింగ్ మృతి చెందారు. సంఘటన స్థలం నుంచి ఆటోమేటిక్ ఏకే 47 రైఫిల్ స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. కాగా ఎదురుకాల్పులు ఇంకా కొనసాగుతుండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది….