…భారత్ న్యూస్ హైదరాబాద్….ఓటర్లకు అందుబాటులో పోలింగ్ కేంద్రాలు: సీఈవో
TG: రాష్ట్రంలో ఓటర్లకు పోలింగ్ కేంద్రాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లు, ఎన్నికల అధికారులను CEO(ఎన్నికల ప్రధానాధికారి) సుదర్శన్ ఆదేశించారు. ఎక్కువ మంది ఓటర్లు ఉన్న పోలింగ్ బూత్లను విడగొట్టి కొత్త బూత్లను ఏర్పాటు చేయాలని సూచించారు.
కుటుంబ సభ్యులందరికీ ఒకే పోలింగ్ కేంద్రంలో ఓటు వేసే సదుపాయం కల్పించాలన్నారు. ఓటర్ ఐడీలో మార్పులు, చేర్పుల విషయంలో ప్రజలకు BLOలు సహకరించాలన్నారు.
