భారత్ న్యూస్ డిజిటల్: హైదరాబాద్
రాత్రిపూట బయట తిరగవద్దు
బాలాపూర్ పోలీసులు హెచ్చరిక
పిల్లల కదలికలపై నిఘా ఉంచాలి
అత్యవసరమైతే తప్ప అర్థరాత్రి వేళల్లో ప్రజలు బయటకు రావద్దని బాలాపూర్ ఇన్స్పెక్టర్ విజ్ఞప్తి చేశారు.
రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు ఆదేశాల మేరకు, DCP Maheshwaram నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో, ACP Maheshwaram జానకి రెడ్డి పర్యవేక్షణలో
వరుస హత్యల నేపథ్యంలో బాలాపూర్ ఇన్స్పెక్టర్ సుధాకర్ ఆధ్వర్యంలో 40 మంది పోలీసులతో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా స్టేషన్ పరిధిలోని సమస్యాత్మక ప్రాంతాల్లో విస్తృతంగా పెట్రోలింగ్ చేపట్టారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు, అత్యవసరమైతే తప్ప అర్థరాత్రి వేళల్లో ప్రజలు బయటకు రావద్దని ఇన్స్పెక్టర్ విజ్ఞప్తి చేశారు. అనుమానితులపై నిఘా ఉంచామని, భద్రతను మరింత కట్టుదిట్టం చేశామని ఆయన వెల్లడించారు.
ప్రతి తల్లిదండ్రులు వారి పిల్లల కదలికల పై నిఘా ఉంచాలి, వారు చెడు అలవాట్ల బారిన పడకుండా తాగు జాగ్రత్తలు తీసుకోవాలి. వారి పిల్లలకు ఏమైనా counseling అవసరం అయితే లోకల్ పోలీసు స్టేషన్ లో సంప్రదించగలరని తెలిపారు

వ్యాపార సంస్థలు నిర్దేశించిన సమయంలో రాత్రి వేళల్లో షాపులు మూసివేసి, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసుల కు సహకారం అందించాలని ఆయన సూచించారు