భారత్ న్యూస్ ఢిల్లీ…..నేడు కేంద్ర కేబినెట్ భేటీ.. పేలుడుపై చర్చ
ఢిల్లీ పేలుడు ఘటన నేపథ్యంలో ఇవాళ కేంద్ర కేబినెట్ భేటీ కానుంది. సాయంత్రం 5.30 గంటలకు ప్రధాని మోదీ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. పేలుడు ఘటనపై తదుపరి ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై ప్రధానంగా చర్చించనున్నారు. భద్రతా అంశాలతో పాటు పలు ఇతర కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ సమావేశంలో తీసుకునే నిర్ణయాలు దేశ భద్రత దృష్ట్యా చాలా కీలకం~£
